గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. చిక్కడపల్లి లోని శ్రీవేంకటేశ్వర స్వామి టెంపుల్ లేన్ వరదా మెస్ బిల్డింగ్ లో గల కార్యాలయంలో ఈ నెల 30 వ తేదీ వరకు కొనసాగే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మొదటి రోజు జర్నలిస్టుల నుంచి విశేష స్పందన లభించింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ పత్రికలు, టీవీ చానెల్స్ లో పని చేస్తున్న చాలా మంది సీనియర్ జర్నలిస్టులు దరఖాస్తు ఫారాలు తీసుకోవడంతో పాటు కొందరు జర్నలిస్టులు వెంటనే సభ్యత్వ రుసుముకు సంబంధించిన డీడీలతో దరఖాస్తులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్, డైరెక్టర్ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సభ్యత్వ నమోదు ఈనెల 30వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుందని సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు మామిడి సోమయ్య, బొల్లం శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన జర్నలిస్టులు రూ.1050 బ్యాంకు డీడీతో పాటు సీనియారిటీ సర్టిఫికెట్, అడ్రస్ ప్రూఫ్ దరఖాస్తుకు జతచేసి ఇవ్వాలని కోరారు.
సత్యం న్యూస్, అంబర్పేట్