28.2 C
Hyderabad
May 17, 2024 11: 06 AM
Slider ప్రపంచం

సేవ్ మీ:అంతాఖాళీ మమ్ముల్ని తీసుకెళ్లండి

kovid-19 vuhana indian couple shouted apprtment vacated all please save us

తాము నివాసిస్తున్న అపార్ట్ మెంట్ నుండి అందరు వెళ్లిపోవడం తో ఖాళి అయ్యిందని ఒంటరిగా జీవించ లేక పోతున్నామని ఓ భారతీయా జంట పడుతున్న ఆవేదన ఇది. చైనాలో కొవిడ్‌-19 జన్మస్థానమైన వుహాన్‌ నగరంలో ఇద్దరు భారతీయ దంపతులు స్వదేశానికి వచ్చేందుకు పాట్లు పడుతున్నారు. యూపీకి చెందిన ఆ దంపతులు తమను స్వదేశానికి తీసుకెళ్లండంటూ కేంద్రప్రభుత్వానికి సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా వారు చైనాలో ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను వీడియోలో వివరించారు. యూపీకి చెందిన ఆశిశ్ యాదవ్‌ చైనాలోని టెక్స్‌టైల్‌ వర్శిటీలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య నేహ పీహెచ్‌డీ స్కాలర్‌. కొవిడ్‌-19 కారణంగా ఇటీవల చైనాలోని భారతయుల్ని రప్పించేందుకు కేంద్రం విమానం పంపింది.

కానీ ఆ సమయంలో నేహకు శస్త్రచికిత్స జరగడంతో రాలేకపోయామని ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు బాలేవని వారు వీడియోలో వివరించారు. తాము ఉంటున్న అపార్ట్‌మెంట్‌ మొత్తం ఖాళీ అయిందని.. తమను భారత్‌కు తీసుకువెళ్లాలంటూ ప్రధానిని కోరారు.

Related posts

రిషి సునాక్ లాంటి వారిని మనమైతే ఎమ్మెల్యేగానైనా గెలిపిస్తామా?

Satyam NEWS

దేవాలయాల్లో మొబైల్ ఫోన్లు బ్యాన్

Murali Krishna

కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు

Murali Krishna

Leave a Comment