తాము నివాసిస్తున్న అపార్ట్ మెంట్ నుండి అందరు వెళ్లిపోవడం తో ఖాళి అయ్యిందని ఒంటరిగా జీవించ లేక పోతున్నామని ఓ భారతీయా జంట పడుతున్న ఆవేదన ఇది. చైనాలో కొవిడ్-19 జన్మస్థానమైన వుహాన్ నగరంలో ఇద్దరు భారతీయ దంపతులు స్వదేశానికి వచ్చేందుకు పాట్లు పడుతున్నారు. యూపీకి చెందిన ఆ దంపతులు తమను స్వదేశానికి తీసుకెళ్లండంటూ కేంద్రప్రభుత్వానికి సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా వారు చైనాలో ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను వీడియోలో వివరించారు. యూపీకి చెందిన ఆశిశ్ యాదవ్ చైనాలోని టెక్స్టైల్ వర్శిటీలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య నేహ పీహెచ్డీ స్కాలర్. కొవిడ్-19 కారణంగా ఇటీవల చైనాలోని భారతయుల్ని రప్పించేందుకు కేంద్రం విమానం పంపింది.
కానీ ఆ సమయంలో నేహకు శస్త్రచికిత్స జరగడంతో రాలేకపోయామని ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు బాలేవని వారు వీడియోలో వివరించారు. తాము ఉంటున్న అపార్ట్మెంట్ మొత్తం ఖాళీ అయిందని.. తమను భారత్కు తీసుకువెళ్లాలంటూ ప్రధానిని కోరారు.