30.2 C
Hyderabad
May 17, 2024 14: 52 PM
Slider హైదరాబాద్

నాణ్యమైన ఔషదాలను ప్రజలకు అందించాలి

#mlauppal

నాణ్యమైన ఔషదాలను ప్రజలకు అందించాలని , వ్యాపారంగంలో బాగా రాణించాలని ఉప్పల్‌ ఎమ్మేల్యే బేతిసుభాష్‌రెడ్డి అన్నారు. ఉప్పల్‌ డివిజన్‌ గణేష్‌నగర్‌ కాలనీలో శుక్రవారం మెడ్‌సేవ్‌ ఫార్మసీ మెడికల్‌ స్టోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మేల్యే మాట్లాడతూ నాణ్యమైన, మన్నికైన ఔషదాలు ప్రజలకు అందించాలని తెలిపారు. 

ఈ ప్రాంతంలో మెడ్‌సేవ్‌ ఫార్మసీ మెడికల్‌ స్టోర్‌  అందుబాటులోకి రావడం వలన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడికల్‌ పార్మసీ నిర్వహకులు రామ్‌కుమార్‌, విజయలక్ష్మి లు  మాట్లాడుతూ మా మెడికల్‌ స్టోర్‌లో నాణ్యమైన ,మన్నికైన ఔషదాలు (మందులు) దొరుకుతాయని , ఔషదాల కొనుకోలుపై కొంత పర్సంటేజి డిస్కౌంట్‌గా ఇస్తున్నామని ఈ సదవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో  టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వరరెడ్డి, గరిక సుధాకర్‌, ఉప్పల్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రెసిడెంట్‌ వేముల సంతోష్‌రెడ్డి, బిసిసెల్‌ ప్రెసిడెంట్‌ గొరిగె ఐలేష్‌, ఎస్సీసెల్‌ అధ్యక్షుడు చిలుగూరి శ్రీకాంత్‌, మహిళా అధ్యక్షురాలు అనితరెడ్డి, యూత్‌ అధ్యక్షుడు అరిటికాయల వంశీముదిరాజ్‌, సత్యపాల్‌రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

లేటెస్ట్ పోస్టర్:నాగచైతన్య సాయి పల్లవి ల లవ్ స్టోరీ

Satyam NEWS

బిఆర్ఎస్ పార్టీకి.. కెసిఆర్ కే మా మద్దతు..

Satyam NEWS

నర్సింగ్ కళాశాల పనులను వెంటనే పూర్తి చేయాలి

Satyam NEWS

Leave a Comment