30.2 C
Hyderabad
May 17, 2024 14: 54 PM
Slider హైదరాబాద్

హై కోర్ట్ కాలనీ టు హెచ్ఎంటి నగర్ లింక్ రోడ్డును పునః ప్రారంభించాలని కేటీఆర్ కి వినతి

#minister

ఉప్పల్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన  మంత్రి కేటీఆర్ ని చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి హై కోర్ట్ కాలనీ నుండి నాచారం హెచ్ఎంటి నగర్ వరకు లింక్ రోడ్డు పున ప్రారంభించాలని వినతి పత్రాన్ని అందజేశారు.

చిల్కానగర్ డివిజన్ లోని హైకోర్టు కాలనీ నుండి దాదాపు 25 నుండి 40 కాలనీల ప్రజలు ఈ లింకు రోడ్డును ఉపయోగించేవారని దాదాపు రెండు సంవత్సరాల నుండి చెరువు సుందరీకరణ పనుల వల్ల ఈ రోడ్డును మూసివేయడం జరిగిందని వెంటనే  పున ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఉప్పల్ చిలకనగర్ మీదుగా నాచారం చేరుకునేందుకు ఈ లింక్ రోడ్డు ఉపయోగపడుతుందని , ఈ లింక్ రోడ్డు మూసివేయడం వలన దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల మెయిన్ రోడ్డు చుట్టూ తిరిగి ట్రాఫిక్ లో ప్రయాణం చేయవలసి వస్తుందని అన్నారు.

జిహెచ్ఎంసి ఎలక్షన్స్ సందర్భంలో  ఈ లింక్ రోడ్డు పునఃప్రారంభిస్తామని వారు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 40 ఫీట్ రోడ్డు వేసి  పున ప్రారంభించి చిల్కానగర్ , నాచారం డివిజన్ల ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్  కేటీఆర్  కోరారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

షర్మిల టార్గెట్ ఆస్తులా? ఓట్లా?

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు

Satyam NEWS

తెలంగాణలో త్వరలో నార్కోటిక్స్ స్పెషల్ వింగ్

Bhavani

Leave a Comment