ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తాడ్వాయి మండలంలోని మేడారం, ఊరట్ఠం గ్రామాలని సందర్శించారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల జంపన్నవాగుతో పాటు చిన్నా పెద్దా వాగులు పొంగిపొర్లడంతో ఈ రెండు గ్రామాల పొలిమేరలు వరద నీరుతో నిండిపోయాయి జలదిగ్బంధం అయ్యాయి.
ఈ సందర్భంగా ఎస్పీ సందర్శించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఏ అవసరం వచ్చినా ఏ సమయంలోనైనా పోలీసులు అందుబాటులో ఉంటారని భయపడొద్దని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారులకు వరదల సమయంలో తీసుకోవలసిన చర్యల గురించి పలు సూచనలు చేశారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు ములుగు ఎ.ఎస్పీ సాయి చైతన్య, పస్రా సీఐ ఎ.శ్రీనివాస్, తాడ్వాయి ఎస్సై జి.రవీందర్, తాడ్వాయి స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.