హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఫేస్ బుక్ లో పోస్టింగ్ పెట్టిన ఆరోపణలపై సినీ నటి మాధవిలతపై కేసు నమోదు అయింది.
గోపికృష్ణ అనే విద్యార్థి చేసిన ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వనస్థలిపురం కి చెందిన గోపికృష్ణ సినీ నటి మాధవి లత ఫేస్ బుక్ లో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా పెట్టిన కామెంట్ ను కూడా ఫిర్యాదుకు జత చేశారు.
దాంతో 295-A సెక్షన్ కింద కేసును రాచకొండ సైబర్ క్రైం పోలీసులు నమోదు చేశారు.