విజయనగరం జిల్లాలో ఎస్పీ దీపిక ఆదేశాలతో సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లు…ఆయాపోలీస్ స్టేషన్ల పరిధిలలో శాఖా పరంగా పలు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు దిశా యాప్ పట్ల అవగాహన కల్పించడంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోలీసు అధికారులు పాటశాలలు, ముఖ్య కూడళ్లను సందర్శించి, విద్యార్థినులు, మహిళల రక్షణకు దిశా యాప్ ఏవిధంగా ఉపయోగ పడుతున్నది వివరించి, వారి మొబైల్స్ లో దిశా యాప్ ను డౌన్లోడ్ చేయించి, రిజిస్ట్రేషన్ చేయించారు.
అలాగేవిజిబుల్ పోలీసింగులో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోలీసు అధికారులు వాహన తనిఖీలు చేపట్టి, రికార్డులు పరిశీలించి, పెండింగులో ఉన్న చలనాలను కట్టించండంతోపాటు, నిబంధనలు అతిక్రమించిన వారిపై కొత్తగా ఈ చలనాలను విధించారు.ఇక జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ దీపిక “స్పందన” కార్యక్రమాన్ని నిర్వహించారు.
బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, సమస్యల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదు దారులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యనారాయణ రావు, డీపీఆర్ బి సీఐడాక్టర్ బి.వెంకటరావు, ఎస్బి సీఐ రుద్ర శేఖర్, ఎస్ఐ మురళి మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.