తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జి నందమూరి సుహాసిని పుట్టిన రోజు పురస్కరించుకొని డాక్టర్ ఏఎస్రావునగర్ టిడిపీ సీనియర్ నాయకులు నీరుకొండ సతీష్బాబు ఆధ్వర్యంలో కేక్కట్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో, కూకట్పల్లి నియోజకవర్గంలో టిడిపీ పార్టీ బలోపేతానికి నందమూరి సుహాసిని ఎంతో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో గడ్డమీద రాములు యదవ్, పసల ప్రసాద్, సాయినాగార్జున , సిహెచ్ నాగేశ్వరరావు, బోళ్ళ వెంకటేశ్, బొప్పన శ్రీనివాస్, వడ్లమూడి శ్రీనివాస్, వాసు, గంగాధర్ ,రాము తదితరలు పాల్గొన్నారు.