తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభంపై చాలా మంది అయోమయానికి గురవుతున్నారు.
గురుకులాలు, హాస్టళ్ల ప్రారంభంపైనే హైకోర్టు స్టే విధించింది. మిగిలిన స్కూళ్లన్నీ తెరుచుకోవచ్చు. అయితే తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవడానికి వీల్లేదు.
ఆన్లైన్/ఆఫ్లైన్ లేదా రెండు పద్ధతుల్లో క్లాసులు నిర్వహించుకోవచ్చు. అది స్కూల్ యాజమాన్యాల ఇష్టం. గురుకులాలు, విద్యాసంస్థల్లోని హాస్టళ్లు తెరవొద్దని మాత్రమే కోర్టు ఆదేశించింది.