పాలిటెక్నిక్ లో ప్రవేశాలకు గాను విజయనగరం జిల్లాలో 29 వ తేదీన నిర్వహించిన పాలిసెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 7,379 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షకు 7,875 మంది దరఖాస్తు చేసుకోగా 97.3 శాతం హాజరు నమోదయ్యింది.
బాలురు 4,551 మంది బాలికలు 2,828 మంది పరీక్ష రాశారు. పట్టణ పరిధిలోని పలు కేంద్రాలను జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును, ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట లైజెన్ అధికారులు, పాలిసెట్ జిల్లా కో ఆర్డినేటర్ & ఎం.ఆర్.ఎ.జి.ఆర్. పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రమణ మూర్తి ఇతర అధ్యాపకులు తదితరులు ఉన్నారు.