కొత్త ఏడాది 2023 కు స్వాగతం పలికేందుకు విజయనగరం ప్రజలంతా గంటస్థంభం వద్ద సమాయత్తం అవుతున్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా… వెకిలి చేష్టలు జరగకుండా ఉండేందుకు జిల్లా పోలీసు బాస్ దాదాపు 150 మంది కి పైగా బందోబస్తు పెట్టారు. ఈ మేరకు విజయనగరం ఇంచార్జి డీఎస్పీ, ఎస్సీ. ఎస్టీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ రాంబాబు, సీఐలు డా.వెంకటరావు, లక్ష్మణరావు లు ఎస్ఐ లు భాస్కర్ రావు లు పకడ్బందీగా బందోబస్తు చేస్తున్నారు.
previous post