గత తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంల మధ్య తేడాను ప్రజల నుంచి సేకరిస్తూ మాజీ ఎమ్మెల్సీ భత్యాల చెంగల రాయుడు “ప్రజా చైతన్య యాత్ర” చేపట్టారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ఈడిగపాలెం లో మంగళవారం రాజంపేట టీడీపీ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ఆధ్వర్యంలో “ప్రజా చైతన్య యాత్ర” నిర్వహించారు.
ఈ సందర్భంగా రేషన్ కార్డుల తొలగింపు,పింఛన్లు రద్దు పై అర్హులైన వారు భత్యాల వద్ద తమ గోడు వెళ్ల బోసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు. ఈ చైతన్య యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను కనుక్కొని వాటిని పరిష్కరించే లా కృషి చేయడమే. ఈ కార్యక్రమంలో పట్టణం లోని టీడీపీ నాయకులు డాక్టర్ సుధాకర్, పొలిశివా, బషీర్,మన్నూరు రాజా, దరూరి కృష్ణ చైతన్య, కళాధర్ బాబు,బాసినేని వేంకటేశ్వర్లు నాయుడు, సంజీవి,మళ్ళెం తిరుపలు, సత్యనరిసింహ గుప్తా తదితరులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.