తమిళనాడులో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కన్యాకుమారిలో ఓ కారు బస్సును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. మైలాడుదురై అనే ప్రాంతంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది.
అతివేగంగా వచ్చి బైకులు, బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, ఆరుగురి పరిస్థితి విషమంగా మారింది. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.