24.7 C
Hyderabad
May 17, 2024 00: 15 AM
Slider ముఖ్యంశాలు

గిరిజన హాస్టల్ లో గర్భం దాల్చిన ముగ్గురు విద్యార్థినులు

warangal

ట్రైబల్ మహిళ డిగ్రీ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు గర్బం దాల్చడం ఆసిఫాబాద్ జిల్లాలో కలకలం రేపింది. పది మంది విద్యార్థినులకు సక్రమంగా రుతుస్రావం రాకపోవడంతో అనుమానం వచ్చి రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు అధికారులు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆ పది మందిలో ముగ్గురు అమ్మాయులకు ప్రెగ్నెస్సీ టెస్ట్ పాజిటీవ్ రాగా, అందులో ఒకరికి 3 నెలల గర్భిణీ అని తేలింది.  హస్టల్ సిబ్బందిపై  అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఆర్‌సీఓ లక్ష్మయ్య విద్యార్థినుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దాదాపు రెండు నెలల ముందే ఈ విషయం తెలిసినా కూడా ఈ విషయం బయటకు రానివ్వకపోవడంతో హాస్టల్ సిబ్బందిపై, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీనికి కారణం ఎవరన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. బాధిత అమ్మాయిలు ఎక్కడెక్కడ నుంచి వచ్చారు, ఎవరెవరిని కలుస్తున్నారు, అన్నదానిపై జిల్లా గిరిజన శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

Related posts

నిత్యాన్నదాన సత్రాలపరిపాలనా కార్యాలయం ప్రారంభం

Bhavani

Protest on police: నేరం చేసిన వైసీపీ నేతపై చర్య తీసుకోరా?

Satyam NEWS

వెంకటేశుడికి భక్తులకు మధ్యలో తిరుమల దేవస్థానం

Satyam NEWS

Leave a Comment