38.2 C
Hyderabad
April 29, 2024 22: 06 PM
Slider నిజామాబాద్

రెండవ విడత పల్లె ప్రగతిపై అవగాహన సమావేశం

bichkunda 28

కామారెడ్డి జిల్లా బిచ్కుంద  మండల కేంద్రంలో 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం శనివారం జరిగింది. కార్యక్రమానికి ముందుగా సురక్ష బిచ్కుంద ప్రతిజ్ఞలో భాగంగా మహిళలను ప్రతి ఒక్కరు గౌరవించాలని ప్రతిజ్ఞ చేశారు.

అనంతరం  ఎంపిపి అశోక్ పటేల్ మాట్లాడుతూ ముప్పై రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జరిగిన అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి ఈ రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సమాయత్తం కావాలన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వైకుంఠ ధామం డంపింగ్ యాడ్ నర్సరీల పై ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామ అభివృద్ధికి   పాటు పడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపితో పాటు జడ్పీటీసీ భారతి రాజు, తహసీల్దార్ వెంకట్రావు, ఎంపీడీవో ఆనంద్ పాల్గొన్నారు.

వీరితో బాటు ఎంపీ మహాబూబ్ తో పాటు మాజీ జడ్పీటీసీ సాయిరాం ఆయా గ్రామాల సర్పంచ్ లు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

Related posts

కక్షపూరితంగానే ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేశారు

Bhavani

Stupidity: రండి తలకు నూనె రాస్తా… కరోనా పోతుంది….

Satyam NEWS

దేవరకొండలో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment