ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన ఖరారయింది. 24, 25, 27 తేదీలల్లో తెలంగాణకు ప్రియాంక గాంధీ రానున్నారు. మూడు రోజుల్లో 10 నియోజకవర్గాల్లో ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు. 24వ తేదీన ఉదయం 11 గంటలకు పాలకుర్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు హుస్నాబాద్లో, సాయంత్రం 4 గంటలకు ధర్మపురి సభల్లో పాల్గొంటారు. 25వ తేదీన పాలేరు, ఖమ్మం, వైరా, మధిర నాలుగు నియోజకవర్గాలలో ప్రచారం చేస్తారు. 27న 11 గంటలకు మునుగోడులో, 2 గంటలకు దేవరకొండ, 4 గంటలకు గద్వాల ప్రచార సభలల్లో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు.
previous post
next post