కోవిడ్ సమయంలో మూడు నెలల సగం జీతాన్నినేడు ఉద్యోగుల అకౌంట్ లో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నసందర్భంగా 55 రోజుల సమ్మెలో మిగిలిపోయిన 12 రోజుల సమ్మె వేతనాన్ని చెల్లించినందుకు ప్రజా రవాణా రంగ సంస్థ ఆర్టీసీని కాపాడుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన సందర్భంలో కృతజ్ఞతా పూర్వకంగా ఆర్టీసీ బస్ భవన్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా నేపథ్యంలో ఆర్టీసీకి విపరీతంగా నష్టాలు వస్తున్నప్పటికీ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక శ్రద్ధ వహించి ఆర్టీసీ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ, సంస్థను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అశోక్, రఘునందన్ వందలాది మంది బస్ భవన్ ఉద్యోగులు పాల్గొని కృతజ్ఞతలు తెలిపారు.