జి.ఓ నెంబర్ 3 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని గిరిజన తండాలలో నేడు నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమావత్ సక్రు నాయక్ తెలిపారు. ఈ మేరకు లంబాడ హక్కుల పోరాట సమితి పిలుపు ఇచ్చిందని ఆయన తెలిపారు.
అదే విధంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కేసును ప్రత్యేక బెంచికి తీసుకువచ్చే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని అన్నారు.
లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు తేజావత్ బెల్లయ్య నాయక్, భూక్య సంజీవ్ నాయక్ ఆదేశానుసారం ప్రతి గిరిజన తండాలో ఇంట్లోనే ఉండి ప్లకారుడుల ద్వారా నిరసన కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు.