నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లి గ్రామంలో ని భూమి లేని 150 మంది నిరుపేదలకు IKR ఫౌండేషన్ ట్రస్ట్ తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిత్యావసర సరుకులను శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో IKR ఫౌండేషన్ ట్రస్ట్ కన్వీనర్ గౌతంరెడ్డి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, నాయకులు మురళీ దర్ రెడ్డి, రాంకిషన్ రెడ్డి, మహేష్ రెడ్డి, రవీందర్ రెడ్ది తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డాక్టర్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయులకు నిత్యావసర సరుకులను శనివారం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలోమున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్,జిల్లా లైబ్రరీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్,మాజీ FSCS చైర్మన్ రాంకిషన్ రెడ్డి,TRS టౌన్ ప్రెసిడెంట్ మారుగొండ రాము తదితరులు పాల్గొన్నారు.