24.7 C
Hyderabad
May 13, 2024 07: 06 AM
Slider రంగారెడ్డి

రామంతపూర్ డివిజన్ లో జ్వరం సర్వేలో పాల్గొన్న కార్పొరేటర్

#ramanthapur

కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జ్వరం సర్వే లో భాగంగా  ఆదివారం రామంతపూర్ డివిజన్ కార్పొరేటర్  బండారు శ్రీవాణి వెంకట్రావు   గాంధీనగర్ లో ఇంటింటికి తిరుగుతూ జ్వరం సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో సర్వేలో పాల్గొన్నారు. సర్వేలో జ్వరం ఉందని తేలిన వారికి ప్రభుత్వం పంపించిన మెడికల్ కిట్టు అందజేశారు. ఈ సందర్భంగా  కార్పొరేటర్  మాట్లాడుతూ కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన మెడిసిన్స్ సరైన సమయానికి వాడుకొని బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండి  మాస్కు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది ఏఎన్ఎం శోభా, ఏ ఎస్ ఎఫ్ బాబురావు, శైలేందర్ , రమేష్ తదితరులు పాల్గొన్నారు. 

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

ఆసక్తి రేపుతున్న కొత్త జంట

Satyam NEWS

ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధం

Satyam NEWS

నీళ్లెక్కడ నియామకాలెక్కడ కేసీఆరూ

Satyam NEWS

Leave a Comment