కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జ్వరం సర్వే లో భాగంగా ఆదివారం రామంతపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు గాంధీనగర్ లో ఇంటింటికి తిరుగుతూ జ్వరం సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో సర్వేలో పాల్గొన్నారు. సర్వేలో జ్వరం ఉందని తేలిన వారికి ప్రభుత్వం పంపించిన మెడికల్ కిట్టు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన మెడిసిన్స్ సరైన సమయానికి వాడుకొని బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండి మాస్కు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది ఏఎన్ఎం శోభా, ఏ ఎస్ ఎఫ్ బాబురావు, శైలేందర్ , రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి