దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన పల్స్ పోలియో విజయవంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడుగంటలకే ప్రారంభమైన పోలియో చుక్కల కార్యక్రమం..సాయంత్రం 5 గంటల తో పూర్తవుతుంది.
ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలో కలెక్టర్.డా.హరి జవహర్ లాల్…ఈ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నగరంలో రాజీవ్ నగర్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ లో చిన్నారులకు జిల్లా కలెక్టర్ పోలియో చుక్కలు వేసారు.
నగరంలో ఏఎన్ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్ వాడీ మెంబర్లు…జొన్నగుడ్డి,లంక వీధి,లంకాపట్నం కాళీఘాట్ కాలనీ,హుడాకాలనీ, ఆర్టీసీ కాంప్లెక్సు ప్రాంతాలలో పిల్లలకు పోలియో చుక్కలు వేసారు.
హెల్త్ సిబ్బంది ముందుగా సిద్దం చేసుకున్న అయిదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసారు. ఈ కార్యక్రమంలో డీఎంఅండ్ హెచ్ ఓ. డా. రమణ కుమారి,ఇమ్యూనైజేషన్ అధికారి నారాయణ,డాక్టర్ లావణ్య మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.