సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని బూత్ నెంబర్ 218లో అత్యధికంగా డిజిటల్ సభ్యత్వాన్ని చేయించిన టి.పి.సి.సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎండీ అజీజ్ పాషా ను నల్లగొండ పార్లమెంటు సభ్యుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు డిజిటల్ సభ్యత్వాన్ని చేర్పించే కార్యక్రమం చురుకుగా సాగుతున్నది.
ఈ సందర్భంగా కెప్టెన్ ఉత్తమ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వాన్ని తీసుకున్న ప్రతి సభ్యునికి ప్రమాదవశాత్తు మరణించిన వారికి రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను అందిస్తుందని అన్నారు. అన్ని బూత్ లలో కూడా ఇదే విధంగా అజీజ్ పాషా ను స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన వారందరూ ఎక్కువ మొత్తంలో సభ్యత్వాన్ని నమోదు చేయించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం తెలంగాణ రాష్ట్రంలోనే హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలలో ఎక్కువ మొత్తంలో రికార్డు స్థాయిలో డిజిటల్ సభ్యత్వ నమోదు ఉండాలని కెప్టెన్ ఉత్తమ్ అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలందరూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జున్ రావు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్,చక్రాల వీరారెడ్డి కస్తాల శ్రవణ్ కుమార్,కోతి సంపత్ రెడ్డి,ముషం సత్యనారాయణ,దొంతగాని జగన్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్