30.2 C
Hyderabad
May 17, 2024 14: 54 PM
Slider వరంగల్

హసన్ పర్తి రోడ్డు ప్రమాదంలో పత్రికావిలేకరి మృతి

#hasanparthy

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి హసన్ పర్తిలో జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. హసన్ పర్తి కి చెందిన బొనగాని చందర్ (35) గౌడ వృత్తి చేసుకుంటూ కుటుంబాన్నీ పోషించుకునే వాడు. ప్రస్తుతం ఓ పత్రికలో విలేకరిగా పని చేస్తున్నాడు.

అతనికి భార్య కూతురు ఉన్నారు. మంగళవారం రాత్రి ఏర్రగట్టు గుట్ట నుంచి హసన్ పర్తి కి స్నేహితుని ద్విచక్ర వాహనం పట్టుకొని వస్తుండగా మార్గ మధ్యలో నల్లగట్టు గుట్ట వద్ద ముందుగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న తన ద్విచక్ర వాహనం ఒక్కసారి వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో చందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ పరారీలో ఉండగా మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి, లారీని పోలీసు స్టేషన్ కు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపారు.

Related posts

చెత్త సేకరణ పన్నును తక్షణమే ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

ఉద్యోగాల క‌ల్ప‌న‌, నిరుద్యోగ భృతిలో ప్ర‌భుత్వం విఫ‌లం బీజేవైఎం

Sub Editor

విజ‌య‌న‌గ‌రంలో “గ‌డ‌ప గ‌డ‌ప‌కు “కార్య‌క్ర‌మం ప్రారంభం……!

Satyam NEWS

Leave a Comment