నిరుద్యోగులకు ఉద్యోగావశాలు కల్పించడంలో, నిరుద్యోగ భృతి అందించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి విఫలైమందని వెంటనే రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ర్ట అధ్యక్షులు భానుప్రకాష్ నేత్రత్వంలో నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలతో మంగళవారం ముట్టడించారు. పెద్ద పెట్టున టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్నతెలంగాణను కేసీఆర్ హస్తగతం చేసుకొని నిరంకుశ పాలన కొనసాగిస్తుందన్నారని విమర్శించారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు, నిరుద్యోగ భృతి కల్పించడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ర్టంలో రెండు లక్షల ఉద్యోగాలకు ఖాళీలుంటే కేవలం 50 వేల ఉద్యోగాలకు మాత్రమే ఖాళీలున్నాయని చెప్పటం వారి చేతగాని పాలనకు నిదర్శనమన్నారు. వెంటనే రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసి ఆయా ఉద్యోగాల్లో అర్హులైన నిరుద్యోగులకు అందించాలని డిమాండ్ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు బీజేవైఎం నాయకులను అరెస్టు చేసి రాంగోపాల్ పేట్, గాంధీనగర్, నారాయణగూడ, చిక్కడపల్లి, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లకు తరలించారు.