పల్నాడు జిల్లాలో అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రంగా భాసిల్లుతున్న కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం నూతన ఈ ఓ గా వేమూరి గోపి బుధవారం భాద్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించేందుకు విచ్చేసిన వేమూరి గోపికి ఆలయ ఆస్థాన పండితులు అధికారులు ఘన స్వాగతం పలికారు.
త్రికోటేశ్వర స్వామి చెంత ప్రత్యేక పూజలు నిర్వహింపజేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఈవో కార్యాలయంలో ఆయన స్థానంలో ఆసీనులైన మీదట వేదమంత్రోచ్చారణల సాక్షిగా భాద్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో గురుకులు, నాగభోగేశ్వర రావు కొండకావురు రామకృష్ణా, దక్షిణామూర్తి, చల్లా శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ సి హెచ్ నాగిరెడ్డి, బి హెచ్ మల్లిఖార్జున రావు తదితరులు పాల్గొన్నారు.