అటు పార్టీ పరంగా ఇటు సీఎం ఆదేశాలకు అనుగుణంగా…అనుకున్న విధంగానే విజయనగరంలో “గడపగడపకు” అన్న కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు.ఈ మేరకు నగరంలోని రండో డివిజన్ అయిన పూల్ భాగ కాలనీలో… అప్కోభవన్ నుంచీ ఈ గడపగడపకు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోలగట్ల ప్రారంభించారు.
ముందుగా దైవ దర్శనం చేసుకుని, అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. సచివాలయం వారీగా లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకొని గడప గడపకు మన ప్రభుత్వం పర్యటనకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అమలు తీరు, అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం మీడియాతో ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ గడపగడపకు వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకున్నామని…. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయని ప్రజలు చెప్పడంతో ఆనందంగా ఉందన్నారు. . ఎక్కడా లంచగొండి, అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అందడం తమ ప్రభుత్వ గొప్పతనం అని పేర్కొన్నారు. . రెండో డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ బండారు ఆనందరావు కు లభిస్తున్న ప్రజాదరణ బట్టి ఆయన చేస్తున్న సేవలు ప్రస్పుటమవుతున్నాయని అన్నారు. .
గతంలో పాలకులు పాలనను గాలికి వదిలి అభివృద్ధిని మరిచారని,తమ హయాంలో నగర అభివృద్ధి తో పాటు ప్రజలకు అవసరమైన తాగునీరు, మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మేయరు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ రేవతీదేవి, కమిషనర్ ప్రసాదరావు, పార్టీ నగర అధ్యక్షులు ఆసపు వేణు, సీనియర్ కార్పొరేటర్ రాజేష్, పరిశ్రమ అభివృద్ధి మండలి రాష్ట్ర డైరెక్టర్ సంఘం రెడ్డి బంగారు నాయుడు, జోనల్ ఇంచార్జ్ ముద్దాడ మధు,ఈశ్వర్ కౌశిక్,ముచ్చు శ్రీను ,2వ డివిజన్ కార్పొరేటర్ బండారు ఆనందరావు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ అధికారులు,వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.