కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో వెల్లడి: షోకాజ్ నోటీసు జారీ చేసిన డిఎంఅండ్ హెచ్ ఓ
విధులకు గైర్హాజరైన పోలిపల్లి పిహెచ్సి వైద్యులకు, విజయనగరం జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్వి రమణకుమారి షోకాజ్ నోటీసు జారీ చేశారు.జిల్లా కలెక్టర్ ,ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశాలతో డీఎంఅండ్ హెచ్ ఓ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఈ నెల 27వ తేదీ సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో, భోగాపురం మండలం పోలిపల్లి పిహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇక్కడ 24 గంటలూ వైద్యసేవలను అందించాల్సిన పిహెస్సి, అప్పటికే మూసి వేసి ఉండటం, వైద్యులు, సిబ్బంది ఎవ్వరూ విధుల్లో లేకపోవడంతో, కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులపై తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, డిఎంఅండ్హెచ్ఓను ఆదేశించారు. ఈ మేరకు పిహెచ్సి డ్యూటీ డాక్టర్ టి.తిరుపతి స్వామి, డిప్యుటేషన్పై అక్కడినుంచి విధులను నిర్వర్తిస్తున్న డాక్టర్ మహేష్ లకు, డిఎంఅండ్హెచ్ఓ షోకాజ్ నోటీసులను జారీ చేశారు.