వనపర్తిలోని పాత బస్టాండ్ ప్రక్కన మూత్ర శాలకు వెళ్లకుండా తడకలు అడ్డంగా పెట్టారు.గ్రామాల నుండి వనపర్తికి వచ్చే ప్రజలు మూత్రశాలకు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు. మూత్రశాలకు వెళ్ళే వారు ఇబ్బందులు పడుతున్న విషయం మునిసిపల్ కమిషనర్ కు ఫోన్ ద్వారా తెలిపినా చర్యలు లేవు.
ఇది వనపర్తి పాలన. సమాజంలో సమస్యల గురించి అడిగితే నేరంగా భావిస్తారు.సమాజంలో ఇంకా కొందరు సమస్యను పరిష్కరించకుండా,సమస్యను వెలుగులోకి తెచ్చిన వారిని పరోక్షంగా ఇబ్బందులు పెట్టడం,పరిష్కారం చేయని వారిని పొగడటం వారి నైజం.అదే విదంగా ఆర్టీసీ కొత్త బస్టాండులో మూత్ర శాలలను శుభ్రం చేయాలని,ప్రతి నిత్యం పైపు ద్వారా నీటిని వదిలి,రోగాలు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్