27.7 C
Hyderabad
May 17, 2024 23: 50 PM
Slider ముఖ్యంశాలు

నెల్లిమర్ల లాకప్ డెత్ కేసులో ఎస్ఐ పై సస్పెన్షన్ వేటు

#nellimarlapolicestation

ఏపీ రాష్ట్ర డీజీపీ ఉత్తరాంధ్ర లి ఉన్న వేళ…పోలీసు శాఖ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఇటీవలే విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల పీఎస్ లో లాకప్ డెత్ జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమన సంగతి విదితమే. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి..ఆర్డీఓ ను విచారణ అధికారిగా నియమించిన సంగతి కూడా తెలిసిందే. ఈ క్రమంలో అన్ని కోణాలలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. విచారణ లో..స్టేషన్ లో నిందితుడిని సెల్ లో ఉంచకుండా బయట ఎందుకు ఉంచారు..? అదే విధంగా నిందితుడు కి అందుబాటులో తాడు ఎందుకు ఉంచారన్న అంశాలు మెజిస్ట్రీయల్ విచారణ లో తేలింది. ఇందుకు నెల్లిమర్ల ఎస్ఐ రవీందర్ ని బాధ్యతుడని చేస్తూ సస్పెన్షన్ చేసినట్లు సమాచారం. విశేష మేంటంటే జిల్లా కు డీజీపీ వస్తున్నారన్న ఒక్క రోజు ముందే ఎస్ఐపై చర్యలు తీసుకోవడం కొసమెరుపు.

Related posts

ఇ ఎస్ ఐ సి ఆసుపత్రి సిబ్బందికి వేధింపుల కరోనా

Satyam NEWS

ఏజన్సీ లో మెగా వైద్య శిబిరం

Murali Krishna

మానవత్వాన్ని చాటుకున్న నరసరావుపేట ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment