28.7 C
Hyderabad
May 6, 2024 07: 06 AM
Slider గుంటూరు

మానవత్వాన్ని చాటుకున్న నరసరావుపేట ఎమ్మెల్యే

#ysjaganmohanreddy

గుంటూరు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని చూసి కారు దిగి వచ్చి.. ప్రథమ చికిత్స చేశారు. ఈ రోజు  ఉదయం  శ్రీనివాసరెడ్డి  తాడేపల్లి లో సీఎం జగన్ మోహన్ రెడ్డి కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో చిలకలూరిపేట రోడ్డు లో గల ఫ్లే ఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది.

ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడిని చూసిన శాసనసభ్యులు.. వెంటనే కారు దిగి వచ్చి… అతడికి ప్రథమ చికిత్స చేశారు. వెంటనే మరో వాహనంలో హాస్పిటల్ కు తరలించారు. సీఎం కార్యక్రమానికి వెళ్తూ కూడా ప్రమాదానికి గురైన వ్యక్తిని చూసి స్పందించిన ఎమ్మెల్యే పట్టణ వాసులు ప్రశంసించారు. ఎమ్మెల్యే మాదిరిగానే ప్రజలు కూడా ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ ఆపన్న హస్తం అందిస్తే ఎంతో మందిని బతికించిన వారం అవుతాం.

ఈరోజు మంగళగిరిలోని ఆత్మకూరు వద్ద గౌరవ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన అక్షయ పాత్ర కిచెన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Related posts

అనాథాశ్రమంలో వంటచేసి పిల్లలకు వడ్డించిన కాలేరు పద్మ

Bhavani

కార్మిక ఉద్యమం నుంచి పుట్టిందే మహిళాదినోత్సవం

Satyam NEWS

శ్రమయేవ జయతే

Satyam NEWS

Leave a Comment