రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం కొదురుపాక నుండి వేములవాడ అర్బన్ మండలం అగ్ర హారం వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని బిజెపి నేత ఎర్రం మహేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మిడ్ మానేరు నిర్మాణంలో ముంపుకు గురైన గ్రామాల ప్రజలకు ఇప్పటి వరకు కేవలం రిహభిటేషన్ మాత్రమే ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం చేతులు దులుపుకుందని,పోలాలు, కుల వ్రుత్తులు కోల్పోయిన గ్రామస్థులు ఉఫాధి లేక ఇక్కట్లకు గురవుతున్నరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తాను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అర్జన్ రామ్ మేఘవాల్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశామని ఆయన తెలిపారు.ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో 12,550 మంది ప్రజలు 25 వేల ఎకరాల భూములను కోల్పోయి ఉపాది కోసం ఎదురు చూస్తున్నారని దీనిపై స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావులు ఎన్ని సార్లు వినతి చేసిన పట్టించుకోవడం లేదనితెలిపారు.కేంద్రప్రభుత్వం ఇక్కడ కారిడారు కు అనుమతిస్తే చిన్న పరిశ్రమల ఇక్కడికి తరలివచ్చి ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలుపగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అర్జన్ రామ్ మేఘవాల్ సానుకూలంగా
స్నందించినట్లు, తనను డిల్లీలో కలిస్తే కారిడారు ఏర్పాటుకు సహకరిస్తనని హమి ఇచ్చినట్టు మహేశ్ తెలిపారు.
previous post