సూర్యాపేట జిల్లా కేంద్రానికి కూతవేట్టు దూరంలో ఉన్న మండల పరిషత్ అధికారులు కార్యాలయానికి సకాలంలో హాజరు కావడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడంతో మూకుమ్మడిగా ఉద్యోగులంతా తరచూ విధులకు గైరాజరు అవుతూ సమయపాలన పాటించట్లేదు.
గత కొంతకాలంగా మండల పరిషత్ కార్యాలయంలో కొందరు చిత్తశుద్ధి లేని ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తుండడంతో, అధికారులు లేకపోవడం, ఉన్నవారు సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడం రిజిస్టర్లలో టూర్ల పేర్లు రాస్తూ సొంత పనులు చేసుకుంటున్నారని ఆరోపణలు విలువబడుతున్నాయి. గురువారం చివ్వెంల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో 10.46 గంటలకు అధికారులకుర్చీలు కాళీ సీట్లతో దర్శనమిస్తున్న దృశ్యాలు చూడవచ్చు.