రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ జిఎచెంసి పార్క్ లో హీరో నాని, హీరోయిన్స్ కృతిశెట్టి, సాయి పల్లవి, నిర్మాత బోయినపల్లి వెంకట్ మొక్కలు నాటారు. హీరో నాని మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అని పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళుతున్నారని అన్నారు.
సినిమా ఇండస్ట్రీ, రాజకీయ నాయకులు అందరూ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ప్రజల్లో ఎంతో అవగాహన కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని నాని అన్నారు. గ్లోబల్ వార్మిగ్ ని అరికట్టడానికి గ్రీన్ ఇండియా చాలెంజ్ దోహదపడుతుందని భవిష్యత్ తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని నాని పిలుపునిచ్చారు.
కార్యక్రమం అనంతరం గ్రీన్ఇండియా చాలెంజ్ కరుణాకర్ రెడ్డి,రాఘవ వృక్ష వేదం పుస్తకాన్ని హీరో నాని, హీరోయిన్లు సాయి పల్లవి, కృతి శెట్టి కి అందజేశారు. ప్రకృతి పై ప్రేమతో వేదాలతో కూడిన వృక్షవేదం పుస్తకాన్ని రూపొందించిన ఎంపీ సంతోష్ కుమార్ పై నాని, సాయి పల్లవి, కృతిశెట్టి ప్రశంసల జల్లు కురిపించారు.