దేశ భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉందని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.ఖమ్మం లోని ఎస్బిఐటి కాలేజీ లో నెహ్రూ యువక కేంద్రం భాగస్వామ్యం తో నిర్వహించిన కార్యక్రమంలో
ఎంపీ నామ పాల్గొని, మాట్లాడారు. యువత సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. పేద విద్యార్థుల కోసం వేయికి పైగానే గురుకులాలు పెట్టిన చరిత్ర సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదని
అన్నారు. పల్లెటూళ్ల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారని, నేను కూడా పల్లెటూరి లోనే పుట్టానని, పేదల కష్టాలు తనకేరుక అన్నారు. విద్యార్థులు, యువకులు సామాజిక సేవల్లో విస్తృతంగా పాల్గొని, సమాజానికి అంకితమై పని
చేయాలన్నారు. ఎస్బీఐటీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమ సమయంలో ఎంపీ నామ నాగేశ్వరరావు ఉద్యమ స్ఫూర్తి తనకెంతగానో స్ఫూర్తినిచ్చిందన్నారు. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టే సందర్భంలో తలువులు
నెట్టుకుంటూ ముందుకొచ్చి,తెలంగాణా బిల్లుకు మద్దతు కూడగట్టారని అన్నారు. ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం ఎంపీ నామను శాలువా తో సన్మానించింది. కార్యక్రమంలో ఎస్బీఐటీ కాలేజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, నల్లమల
వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రాజ్ కుమార్ , ఎన్వైకే ప్రెసిడెంట్ అన్వేష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.