40.2 C
Hyderabad
May 2, 2024 18: 44 PM
Slider ఖమ్మం

వడదెబ్బకు గురై వ్యక్తి మృతి

#sunburn

తీవ్రంగా వీస్తున్న ఎండలు, వడగాడ్పులతో మహబూబాబాద్ జిల్లా మండల కేంద్రమైన గార్ల ఇందిరా నగర్ కాలనీ చెందిన వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇందిరా నగర్ కాలనీ వాసి తడికమల్ల

శ్రీనివాస్ (45) టైలర్ వృత్తితో జీవనం సాగిస్తున్నాడు. గత రెండు రోజుల క్రితం టైలర్ పని చేస్తూ వడగాడ్పులతో అస్వస్థతకు గురికావడంతో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో వైద్యం చేయించారు. ఆరోగ్యం కొద్దిగా కుదుటపడటంతో

ఇంటికి తీసుకెళ్లారు. నేటి తెల్లవారుజాము నుంచి వాంతులు, విరోచనాలు కావడంతో కుటుంబ సభ్యులు తిరిగి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. శ్రీనివాస్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వడదెబ్బకు గురై మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, మండల కన్వీనర్ కందునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

Related posts

మతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ పాలన

Bhavani

ఆర్యవైశ్యుడికి మూడు లక్షల రూపాయల సహాయం

Satyam NEWS

హైదరాబాద్ సీపీ సివి ఆనంద్ ను కలిసిన డి ఎస్ సేవ సభ్యులు

Satyam NEWS

Leave a Comment