ఖమ్మం మన్సిపాలిటీ నగరపాలక సంస్థగా రూపాంతరం చెందింది. పెరుగుతున్న జనాభా, వారి అవసరాలకు అనుగుణంగా పాత మున్సిపల్ కార్యాలయంలో సౌకర్యాలు లేవు. మున్సిపల్ అధికారులు సౌకర్యవంతమైన
వాతావరణంలో పనిచేసే వెసులుబాటు లేదు. ప్రజలకు పార్కింగ్ సౌకర్యమూ ఉండేది కాదు. దీంతో మంత్రి పువ్వాడ అజయ్ కృషి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన నగరపాలక సంస్థ కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
నిర్మాణానికి ప్రభుత్వం రూ.23 కోట్లు విడుదల చేసింది. మంత్రి అజయ్కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని కార్యాలయ నిర్మాణం పూర్తి చేయించారు. ప్రస్తుతం అన్ని వసతులతో కార్యాలయం అందుబాటులోకి వచ్చింది.