ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వీరన్నబావి చెంటర్లో ఉండే శ్రీ శ్రీ కాళికాంబాదేవి దేవస్థానం లో గత సంవత్సర కాలం నుంచి ప్రతి శుక్రవారం దాతల ఆర్థిక సహాయ సహకారాలతో భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ శ్రీ కాళికాంబాదేవి అమ్మవారు దగ్గర పేద సాదా తేడా లేకుండా అందరూ కలిసి సహ బంతిలాగా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఈ ఆయనవాయితీ ప్రకారం ఆలయ కమిటీ వారు నేడు భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు.
ప్రతి శుక్రవారం భోజన సౌకర్యం ఏర్పాటు చేయడానికి దాతలు ముందుకు రావాలని ఆలయ కమిటీ వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి పాల్వాది నరేంద్రా చారి దండూరి నడిపిసోమయ్య, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్, బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు, దగ్గుపాటి జయరాములు,కాషయ్య,హరి,అమ్మవారి భక్తులు తదితరులు పాల్గొన్నారు.