టీటీడీ వెబ్సైట్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్ నిలిచిపోయింది. ఆన్లైన్లో టికెట్ల కొనుగోలుకు ఎక్కువ సంఖ్యలో భక్తులు ప్రయత్నించడంతో సమస్య ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ నెలకు ప్రత్యేక ప్రవేశం దర్శనం టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. అక్టోబర్ 1 నుంచి 25 వరకు రోజుకు 8 వేల టికెట్లు చొప్పున అందుబాటులో ఉంచింది. దీంతో పెద్ద ఎత్తున భక్తులు వాటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. గతంలోనూ పలుమార్లు ఇదే తరహా సమస్య వచ్చింది. జియో సర్వర్తో అనుసంధానించినప్పటికీ తిరిగి మళ్లీ సాంకేతిక లోపం ఏర్పడింది. దీన్ని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సాంకేతిక సమస్యను పరిష్కరించిన తర్వాత ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లపై టీటీడీ ప్రకటన చేసే అవకాశముంది.