ప్రతి సోమవారం కలెక్టర్ ద్వారా నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం (ఫిర్యాదుల విభాగం) ఈ నెల 27 వ తేదీ నుండి పునఃప్రారంభించనున్నట్లు కలెక్టర్ నేడోక ప్రకటనలో తెలిపారు. కరోన, లాక్ డౌన్ కారణంగా 2020 మార్చి 9 నుంచి వాయిదా వేసిన ప్రజావాణి కార్యక్రమాన్నీ ప్రతి సోమవారం పునఃప్రారంభం అవుతుందన్నారు.
జిల్లా కేంద్రం కలెక్టరేట్ ప్రజావాణి హాల్లొ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సంబంధిత జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలని ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు కొనసాగే ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసుకోవాలన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.