ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వల్ప అస్వస్థత ఏర్పడింది. దాంతో ఆయన రేపటి ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. ఉదయం వ్యాయామం సమయంలో సీఎం జగన్కు కాలు బెణికింది. దాంతో ఆయన వ్యాయామం నిలుపుదల చేశారు. సాయంత్రానికి కూడా నొప్పి తగ్గకపోవడంతో ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించారు. ఈ కారణంగా ఆయన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు.