జిల్లా నుండి ఎస్సై మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు ఎంపికైన 4000 మంది అభ్యర్థులకు ఈ రోజు నుండి 22వ తారీకు వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ జరుగుతుంది.ఈ రోజు జిల్లా కేంద్రంలోని క్లబ్ నందు ఈ ప్రక్రియ మొదలైంది.
అభ్యర్థులకు కేటాయించిన తేదీల ప్రకారం ఈ ప్రక్రియకు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాల్సి ఉంటుంది.పోలీసు ఉద్యోగాల కొరకు అప్లై చేసుకునే సమయంలో అభ్యర్థులు అప్లికేషన్లో ఏవైనా పొరపాటులు చేసి ఉంటే,వాటిని సరిదిద్దుకోవడానికి కూడా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెసులుబాటు కల్పించింది.
ఈ ప్రక్రియను జిల్లా ఎస్పీ డా.వినీత్. పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నియమ నిబంధనల ప్రకారమే ఈ ప్రక్రియ జరుగుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు.