38.2 C
Hyderabad
April 28, 2024 20: 01 PM
Slider జాతీయం

చిరాగ్, పారస్‌లకు వేర్వేరు ఎన్నికల గుర్తులు

లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) సమస్యకు కేంద్ర ఎన్నికల సంఘం  తాత్కాలిక పరిష్కారం చూపింది. ఇంతకాలం వినియోగంలో ఉన్న పార్టీ పేరు, పార్టీ ఎన్నికల గుర్తు ఇల్లు గుర్తును చీలిక వర్గాలైన చిరాగ్‌ పాశ్వాన్, పశుపతి కుమార్‌ పారస్‌లు వాడొద్దని గతంలోనే ఈసీ ఆదేశాలివ్వడం తెల్సిందే.

తాజాగా ఇరు వర్గాలకు వేర్వేరు పేర్లు, ఎన్నికల గుర్తులు కేటాయించింది. చిరాగ్‌ పాశ్వాన్‌ వర్గానికి ‘లోక్‌ జనశక్తి పార్టీ(రాం విలాస్‌) పేరును, హెలికాప్టర్‌ గుర్తును కేటాయిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. పారస్‌ వర్గానికి ‘రాష్ట్రీయ లోక్‌ జన శక్తి’పేరును, ఎన్నికల గుర్తుగా ‘కుట్టుమిషన్‌’ను ఇస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. ఉప ఎన్నికల్లో ఈ పేర్లు, గుర్తులను వాడుకోవచ్చని ఈసీ ఇరు వర్గాలకు వేర్వేరుగా లేఖలు రాసింది.

Related posts

జై గుడివాడ: కాసినో నడిపిన వారికి రామ్ గోపాల్ వర్మ పూర్తి ‘‘మద్దతు’’

Satyam NEWS

రేవంత్ రెడ్డికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన అజహరుద్దీన్

Satyam NEWS

జగన్ పార్టీ నుండి లీడర్లు పారిపోవడం షురూ!

Satyam NEWS

Leave a Comment