వరుణ్ కృష్ణ ఫిల్మ్స్ బ్యానర్ పై శేషుదేవరావ్ మలిశెట్టి నిర్మాణంలో శ్రీకృష్ణ మలిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “నువ్వే నా ప్రాణం!. కిరణ్రాజ్, ప్రియాహెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్, భానుచందర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని డిసెంబర్ 30న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్ ప్రసాద్ల్యాబ్స్లో ఘనంగా నిర్వహించారు.
విలేఖరుల సమావేశంలో… చిత్ర నిర్మాత శేషుదేవరావ్ మల్లిశెట్టి మాట్లాడుతూ… మొట్ట మొదటిసారి సినిమా రంగంలో అడుగుపెట్టాము. మమ్మల్ని ఆదరించి మా సినిమాను హిట్ చేయాలని కోరుకుంటున్నాను. మా చిత్రంలో సుమన్, భానుచందర్ లాంటి లెజండ్స్ నటించారు. ఎన్నో చిత్రాల్లో నటించిన వాళ్ళ దగ్గర నేర్చుకోవలసింది చాలా ఉంది అన్నారు.
దర్శకుడు శ్రీకృష్ణ మల్లిశెట్టి మాట్లాడుతూ… ఈ చిత్రం ఒక ప్యాషన్తో తీయలేదు. ఒక ధ్యేయంతో తీశాము. సినిమా తీయడం వల్ల ఎంతో మంది ట్యాలెంటెడ్ పర్సన్స్ ను ఎంకరేజ్ చేయడంతోపాటు వారికి ఉపాధి కలిగించే అవకాశం ఉంటుందన్న ధ్యేయంతో ఈ ఫీల్డ్లో అడుగు పెట్టడం జరిగింది.
ఇంట్రస్ట్ ఉండి అవకాశం లేక ఇబ్బంది పడుతున్న చాలా మందికి ఒక ప్లాట్ఫామ్ కావాలనేది మా కోరిక. 2019 లో చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. కోవిడ్ రావడంతో కాస్త ఆలస్యం అయింది. 700 చిత్రాలకు పైగా నటించిన సుమన్గారు, భానుచందర్ గారు ఇందులో నటించడం మా అదృష్ణంగా భావిస్తున్నాము. అలాగే డేట్స్ విషయంలోగాని ఎక్కడా కూడా అంత పెద్ద సీనియర్ యాక్టర్లు అయినప్పటికీ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు.
ఈ చిత్రంలో ఫైట్స్, సాంగ్స్ చాలా అద్భుంగా వచ్చాయి. ప్రియాహెగ్డే కూడా చాలా బాగా నటించింది. కన్నడ, తెలుగు చిత్రాల్లో ఇప్పటివరకు ఏడెనిమిది చిత్రాల్లో నటించింది. మా చిత్రంలో నటించాక చాలా అవకాశాలు వచ్చాయి. మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. శ్వేతాశర్మ చాలా అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మన్స్ ఇచ్చింది. శ్వేత ఢిల్లీలో ఓ మంచి డాన్స్ ఇన్స్టిట్యూట్ లో లెక్చరర్గా పని చేస్తుంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్గా డిసెంబర్30న విడుదల చేస్తున్నాము అన్నారు.