విజయనగరం లో మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతంగా పూర్తయ్యిందని జిల్లా టీడీపీ నేతలు అన్నారు ఈ మేరకు అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు, ఆయన బిడ్డ పార్టీ పార్లమెంటరీ నేత ఆదితీగజపతిరాజు, బొద్దుల నరసింగరావు నగర పార్టీ అధ్యక్షుడు ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్, కఃది మురళి లు మాట్లాడారు.
చంద్రబాబు తన విజయనగరం పర్యటన లో జగన్ ప్రభుత్వానికి చుక్కలు చూపించారని అశోక్ గజపతిరాజు అన్నారు. కొత్తవాళ్లు ,యూత్ బాగా వచ్చారని వారిని ఉద్దేశించి బాబు ప్రసంగించారని ఆద్యంతం మంచి స్పందన వచ్చిందన్నారు. ఆదితీగజపతిరాజు మాట్లాడుతూ.. విజయనగరం ప్రజలు అందున..ద్వారపూడి ప్రజలు పెద్ద ఎత్తున నగరంలో ని ద్వారపూడి బ్రిడ్జి వద్దకు వచ్చి..”ఇదేం ఖర్మ బాబు రాష్ఠ్రానికి” అన్న కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు అని ఆమె చెప్పారు.