23.7 C
Hyderabad
May 17, 2024 03: 23 AM
Slider నల్గొండ

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన ఉత్తమ్ పద్మావతి

#uttamkumarreddy

హుజూర్ నగర్,కోదాడ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో జూమ్ యాప్ ద్వారా సమావేశ పరిచి మెంబర్ షిప్ డ్రైవ్,పార్టీ బలోపేతంపై ఆదివారం కోదాడ మాజీ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి దిశా,నిర్దేశం చేశారు.

ఇట్టి సమావేశంలో మూడో వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి మాట్లాడుతూ మూడో వార్డులో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పని చేస్తామని,కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ప్రతి కార్యకర్తకి అందేలా చూడడమే కాకుండా ఈ సంవత్సరం నుండి సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకి నూతనంగా ప్రవేశపెట్టిన యాక్సిడెంటల్ పాలసీ గురించి వివరించి 3వ,వార్డుని సభ్యత్వ నమోద లో ముందు వరుసలో ఉండేలా పనిచేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో 3వ,వార్డు పార్టీ కార్యాలయం నుండి 201,202 బూత్ ఇన్చార్జిలు సంక్రాంతి కోటేశ్వరరావు, గంజి చంద్రమౌళి,7వ,వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల నాగరాజు, బూత్ సభ్యులు శోభన్ బాబు,శ్రీనివాస్, సైదా,రాధిక,సంధ్య,చందు,అంజి,శశిధర్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

పాల్గొన్న ప్రతి కార్యకర్తకి పేరుపేరునా ఉత్తమ్ పద్మావతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలనను ప్రజలు కోరుకుంటున్నారు

Satyam NEWS

కేవలం చట్టాలు చేస్తేనే బాధితులకు న్యాయం జరగదు

Satyam NEWS

Leave a Comment