37.2 C
Hyderabad
April 26, 2024 20: 24 PM
Slider రంగారెడ్డి

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే

#uppalmla

హైదరాబాద్ లోని ఉప్పల్ ప్రాంతంలోని రామంతపూర్ పెద్ద చెరువు  ముంపు ప్రాంతాలయిన సాయిచిత్ర నగర్, రవీంద్రనగర్ కాలనీల సమస్యలు  తీరనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బేతీ సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ తెలిపారు. బుధవారం రామంతపూర్ పెద్ద చెరువు అవుట్ లెట్ పనులు  10కోట్ల 34 లక్షలతో ఉప్పల్ శాసనసభ్యులు  బేతి సుభాష్ రెడ్డి ,కార్పొరేటర్ కక్కిరెణి చేతన హరిష్  నిర్మాణ పనులకు  శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు ఈ కార్య క్రమంలో ఇంజనీరింగ్ అధికారులు  వసంత, డిసి అరుణకుమారి, ఇరిగేషన్ డియి పవన్, సియస్ సోమెష్ కుమార్, బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శులు చెల్లోజు ఎల్లాచారి, చింతకింది ప్రవీణ్ ,సీనియర్ నాయకుల న్యాలకొండ సుమన్ రావు  పడతియానాయక్ ,గ్యార రవి ,రంగరవి, ఎవిచారి, బానోత్ పాండునాయక్, నందునాయక్, దారం వెంకటేష్ గుప్త , హరిబాబు ,  భాస్కర్, ముశిగంపల శివగౌడ్, పుచ్చల అశోక్, మల్లిభాయ్, మహిళా మోర్చ అధ్యక్షురాలు రాగి లతా వెంకట్ రెడ్డి, పోన్నాడ లక్ష్మీ, గీత,  కోతుల అంజలి, మహేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

2025 నాటికి జగన్‌ సీఎంగా ఉంటారా?

Bhavani

పునరావాస కేంద్రాలకు వెళ్ళండి: మంత్రి పువ్వాడ అజయ్

Satyam NEWS

ప్రభుత్వ అధికారులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

Satyam NEWS

Leave a Comment