ములుగు జిల్లా తీన్మార్ మల్లన్న జిల్లా కమిటీ మెంబెర్ మార్త శ్రీనివాస్ హైదరాబాద్ లోని Q న్యూస్ ఆఫీసులో తీన్మార్ మల్లన్నని శనివారం సాయంత్రం కలుసుకున్నారు. ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేశారు. అనంతరం మల్లన్న మీద వరుసగా గత 5 నెలల నుండి జరుగుతున్న దాడులు, అక్రమ కేసులు, తెరాస ప్రభుత్వం చేస్తున్న అన్ని కుట్రలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని అన్నారు. త్వరలోనే తెరాస ప్రభుత్వం చేసిన ప్రతీ అవినీతి దానంతట అదే బయటకు వస్తుందని, తెరాస ప్రభుత్వంకి రోజులు దగ్గర పడ్డాయి అని ఆయన అన్నారు.
previous post