రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారనీ, ప్రజలు ప్రతి పక్షాలను నమ్మరని ఉప్పల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. శనివారం చిలుకనగర్ డివిజన్ బీజేపీ నుండి బిఆర్ఎస్ పార్టీ లోకి బండారి లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై కరడు గట్టిన బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతుండడంతో జాతీయ పార్టీలు బేజారు అవుతున్నాయని చెప్పారు. దీంతో ఆ పార్టీలకు భారీ షాక్ తగులుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెండో స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయని ఆయన వివరించారు. పార్టీలు ముఖ్యం కాదని, అభివృద్ధి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రతి పక్షాలను నమ్మి మోసపొవద్దని కోరారు. ఆ పార్టీలను నమ్మి మోసపోతే గోసపడుతారని ఆయన తెలిపారు.
అభివృద్ధి పథకాలు కొనసాగాలంటే తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని కోరారు. కల్లి బొల్లి మాటలను నమ్మవద్దని ఆయన కోరారు. అధికారంలోకి రావడానికి అములు కాని మాటలను చెబుతున్నారని, ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు బజారు అర్జున్, సత్య, నవీన్, శైలేష్, సాగర్, విక్కీ, ప్రవీణ్ ,హరికృష్ణ ,శివ, వినయ్, రాజేష్, ప్రభాకర్, కిరణ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా