మన దేశంలో మన ప్రజలకు ఇచ్చిన కరోనా వైరస్ డోసుల కన్నా విదేశాలకు మనం ఎగుమతి చేసిన డోసులే ఎక్కువ ఉన్నాయి.
దేశంలో 4.5 కోట్ల డోసులు ఇప్పటి వరకూ పంపిణీ చేశారు. అయితే కరోనా వ్యాక్సిన్ అవసరమైన 76 దేశాలకు ఇప్పటి వరకూ మొత్తం 6 కోట్ల డోసులను ఎగుమతి చేశారు.
ఈ వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ రెడ్డి తెలిపారు. చండీగఢ్ లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ ప్రాంగణంలో ఆదివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు.
తమ పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కరోనా వ్యాక్సిన్ ను ఉద్యమంలా తయారు చేస్తున్నామని మంత్రి వివరించారు.