ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వర రావు, వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్ నక్కా భానుప్రియ లకు వెంకటగిరి మున్సిపాలిటీ 6 వ వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు.
6వ వార్డు కౌన్సిలర్ మాడా జానకిరామయ్య ఆహ్వానం మేరకు వైస్ చైర్ పర్సన్ చింతపట్ల ఉమామహేశ్వరి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విప్ పూజారి లక్ష్మి, 12వ వార్డు కౌన్సిలర్ సోమా గోపాలకృష్ణ లతో కలిసి వారు వార్డులో నేడు పర్యటించారు.
ఈరోజు ఉదయం ఎన్టీఆర్ కాలనీ 6 వ వార్డు లోని మాడా జానకిరామయ్య నివాసానికి ముందుగా వారు వచ్చారు. 6 వ వార్డు ప్రజలు కొత్తగా ఎన్నికై వార్డు కు వచ్చిన నాయకులకు మేళతాళాలతో, బాణసంచా పేలుళ్లతో అపూర్వ స్వాగతం పలికారు.
అనంతరం మాడా జానకిరామయ్య అతిథులకు తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులతో పాటు వైయస్సార్ సిపి నాయకులు చింతపట్ల మురళి నాయుడు, చింతపట్ల శ్రీనివాసులు నాయుడు,
పూజారి శ్రీనివాసులు, మామిడి హరినాథ్, కలపాటి ప్రసాద్, కొండాపురం శ్రీను, మాడా చంద్రశేఖర్, మేరువ సాంబశివరావు,సాలాపక్షి గోపి, ఎర్రి కుమార్, స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకటగిరి సామాన్యుడు